- Advertisement -
హైదరాబాద్: రజినీ అస్వస్థతపై జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ స్పందించారు. రజినీకాంత్ ఆస్పత్రిలో చేరినట్టు తెలిసి బాధపడినట్టు పవన్ పేర్కొన్నారు. ఆయన కరోనా లక్షణాలు లేవని ఆస్పత్రి వర్గాలు తెలపడం ఊరటనిచ్చిందన్నారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు. రజినీ బిపి సమస్య తప్ప మరొకటి లేదని అపోలో డాక్టర్లు వెల్లడించారు. రజినీని కలిసేందుకు ఎవరూ రావద్దని డాక్టర్లు తలైవాకు విశ్రాంతి అవసరం అన్నారు. బిపిలో హెచ్చుతగ్గులు అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని అపోలో వైద్యులు వెల్లడించారు.
- Advertisement -