Friday, May 10, 2024

శ్రీనగర్‌లో స్వర్ణకారుడి కాల్చివేత

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: గుర్తు తెలియని దుండగులు కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సత్పాల్ ‌నిశ్చల్(62) అనే స్వర్ణకారుడిని కాల్చి చంపారు. సరాయిబాలా ప్రాంతంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే, దుండగులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. చనిపోయిన వ్యక్తి నిశ్చల్ జ్యువెలర్స్‌కు యజమాని. అయితే, దుండగులు ఆయణ్ని ఎందుకు లక్షంగా ఎంచుకున్నారన్నది తెలియదు.

Jeweller allegedly shot dead in Srinagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News