Saturday, April 27, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన న్యాయమూర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ న్యాయస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి శాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి జడ్జి షాలినినీ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సర్కారు దవాఖానాల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనడానికి నిదర్శనం ఇదేననని అన్నారు. నార్మల్ డెలివరీలు చేయడానికి వైద్యులు కృషి చేయాలని మంత్రి వైద్యులను ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News