Wednesday, May 1, 2024

కవి జయరాజ్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరా వు పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డును కవి జయరాజ్‌ను ఎంపిక చే యటం ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ర వీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో ప్ర జా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109 వ జయంతి , తెలంగాణ రాష్ట్ర భాష దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, అధికారికంగా ప్రతి సంవత్సరం సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు ను రాష్ట్ర ప్రభుత్వం ని యమించిన కమిటీ సిఫారసుల మేరకు, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కవి జయరాజ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్‌తో కలిసి అందించారు.

అనంతరం భాష సంస్కృతిక శాఖ అ ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు గ్రహీత కు కాళోజీ నా రాయణరావు అవార్డుతో పాటు 1 లక్ష 116 రూపాయల చెక్కు ను అం దించి ఘనంగా సన్మానించి ఆయన సాహిత్య రంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి. రమణ చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ వివిధ కా ర్పొరేషన్ల ఛైర్మన్‌లు జూలూరి గౌరీశంకర్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికా రెడ్డి, భాష సంస్కృతిక అధ్యక్షులు మంత్రి శ్రీదేవి,పిసిసిబి సభ్యులు సుమి త్ర, భాష సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News