Monday, April 29, 2024

‘తలైవి’తో కంగనకు నేషనల్ అవార్డు ఖాయం

- Advertisement -
- Advertisement -

Kangana will win National Award with 'Thalaivi'

 

నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుండగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజిఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన తలైవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్‌కు ఈ సినిమా కథ నచ్చింది. ఈ చిత్రంలో జయలలితగా ఆమే ఆదరగొట్టింది.

ఈ సినిమా తర్వాత ఆమె టాప్ చైర్లో ఉంటుందని ముందే చెప్పా. అదే జరుగుతుంది అని చెప్పారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ… ‘మా ప్రొడ్యూసర్ విష్ణుకి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోంది. కానీ సినిమా చూసినప్పుడు ఆయనే రైట్ అనిపించింది’ అని అన్నారు. విజయ్ మాట్లాడుతూ… అరవింద్ స్వామి ఈ సినిమాకు బిగ్ పిల్లర్. జయలలిత క్యారెక్టర్‌లో కంగనా ఒదిగిపోయింది. ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్, క్రియేటివ్ హెడ్ బృందా ప్రసాద్, భాగ్యశ్రీ, తిరుమల్ రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News