- Advertisement -
బెంగళూరు: కరోనా కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి జనవరి 2 తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు సిఎం యడియూరప్ప ప్రకటించారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటలకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని యడియూరప్ప తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ”న్యూ స్టెయిన్ కరోనా నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను విధించాలని నిర్ణయించుకున్నాం. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 తేదీ వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఉంటుంది. ప్రజలు దయచేసి సహకరించాలి.” అని కర్నాటక సిఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Karnataka Govt Imposes Night Curfew
- Advertisement -