Saturday, April 27, 2024

లాస్య నందిత మృతిపై కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య మృతికి సంతాపం తెలిపారు. లాస్య అకాల మరణం బాధాకరం అన్న కెసిఆర్ ఆమె కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. లాస్య నందిత మృతిపై హరీష్ రావు సంతాపం తెలిపారు. మరికొద్ది సేపట్లో పటాన్ చెరు ఆసుపత్రికి చేరుకోనున్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. ప్రస్తుతం పటాన్ చెరు అమేదా ఆసుపత్రిలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహం ఉంది. పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News