Thursday, May 16, 2024

అర్థరాత్రి కాలు జారిపడ్డ కెసిఆర్.. ఫామ్‌హౌస్‌ నుంచి హుటాహుటిన యశోదాకు తరలింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కెసిఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్థరాత్రి కాలికి పంచె తగలడంతో, ఆయన కాలు జారి పడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కెటిఆర్‌ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. వైద్యులతో మాట్లాడిన తర్వాత.. కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. కెసిఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు టెస్ట్‌లు చేసిన తర్వాత హెల్త్‌ బులెటిన్‌ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News