- Advertisement -
హైదరాబాద్: నిరాడంబర నేతగా సోలిపేట ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని ముఖ్యమంత్రి కెసిఆర్ కొనియాడారు. ఎంఎల్ఎ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారు. బాధాతప్త హృదయంతో తీర్మానం ప్రవేశపెడుతున్నామని, సోలిపేట మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సభలో కెసిఆర్ మాట్లాడారు. సామాన్య రైతు కుటుంబంలో సోలిపేట జన్మించారని, విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారని, జర్నలిస్టు సంఘం నాయకుడిగా రామలింగారెడ్డికి సముచిత స్థానం ఉందని, ఆయన ఎంఎల్ఎ కాకముందే నుంచే తనతో ఆత్మీయ అనుబంధం ఉందని, ఆడంబరాలు లేకుండా రామలింగారెడ్డి, సభా వివాహం చేసుకున్నారని, తన పిల్లలకు కూడా ఆదర్శ వివాహం చేయించిన ఆదర్శ శీలి సోలిపేట అని ప్రశంసించారు.
- Advertisement -