- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడినప్పుడు గొప్ప ఆశయం సాధించావని సిఎం కెసిఆర్ను ప్రణబ్ ముఖర్జీ మెచ్చుకున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఈటెల సభలో మాట్లాడారు. కెసిఆర్తో ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రణబ్ను తప్పకుండా కలిసేవాళ్లమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలను కెసిఆర్ ఒప్పించారని ఈటెల గుర్తు చేశారు. అన్ని పార్టీల నేతల ఆమోద పత్రాలను ప్రణబ్ కమిటీకి ఇచ్చామన్నారు.
- Advertisement -