మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుంది. ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కీర్తిసురేశ్ సూరారం టెక్ మహీంద్ర క్యాంపస్లో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో దేశం పచ్చదనంగా: నటి కౌసల్య
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా మారుస్తుందని సినీ నటి కౌసల్య పేర్కొన్నారు. నగరంలోని అమీర్పేట సారథి స్టూడియో ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కౌసల్య మాట్లాడుతూ మొక్కలు నాటే అవకాశం లభించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్
కృష్ణ, ఓఎస్డి, అర్భన్ పారెస్ట్రీ, జిహెచ్ఎంసి ఇచ్చిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు గుజరాత్లోని ఆరోగ్యవన్, స్టేట్ ఆఫ్ యూనిట్, కేవైద్యలో ఆయన ఆదివారం మొక్కలు నాటారు. వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా శ్రీనివైద్య, వైస్ ప్రెసిడెంట్, ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు, మధుసూదన్ సీఈఓ, టిఎస్ఐఐసి, అన్ని హరిత హోటల్ మేనేజర్లు, తెలంగాణ పర్యాటక శాఖ విభాగాధిపతులకు ఆయన గ్రీన్ఛాలెంజ్ను విసిరారు.
keerthi suresh accepting Green India Challenge