Monday, May 6, 2024

తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆసియాకప్‌లో భాగంగా జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా సీనియర్ క్రికెటర్ కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పూర్తి ఫిట్‌నెస్ సాధించక పోవడంతో రాహుల్‌ను తొలి రెండు మ్యాచుల్లో ఆడించడం లేదని బిసిసిఐ ఆ ప్రకటనలో వెల్లడించింది.

ఐపిఎల్ మధ్యలో రాహుల్ గాయం బారిన పడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే గాయం పూర్తిగా తగ్గక పోయినా రాహుల్‌కు ఆసియాకప్ జట్టులో స్థానం దక్కింది. కానీ, అతను పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉంచాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News