Friday, May 10, 2024

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన కృష్ణుడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన పుట్టినరోజు పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటుడు కృష్ణుడు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని తన పుట్టినరోజును పురస్కరించుకొని కొండాపూర్ లోని తన నివాస ప్రాంగణంలో సినీ నటుడు కృష్ణుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతున్నానని చెప్పారు.

ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని పొగిడారు. ఇందులో తాను భాగస్వామ్యై మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని కోరారు. ఈ నెల 24 న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కృష్ణుడు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News