- Advertisement -
హైదరాబాద్: తనకు ఎలాంటి అనారోగ్య ఇబ్బందలు లేవని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మంత్రి కెటిఆర్ తెలిపారు. తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై కెటిఆర్ స్పందించారు. నిన్నటి నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కడికి ధన్యవాదాలన్నారు. అనేక సంవత్సరాలుగా తనకు జలుబుకు సంబంధించిన ఎలర్జీ ఉందని, నిన్నటి సిరిసిల్ల పర్యటనలో జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందని, అప్పటికే సిరిసిల్లలో పలు కార్యక్రమాలు షెడ్యూల్ రెడీగా ఉందని కెటిఆర్ తెలియజేశారు. అందుకే ఎవరికీ ఇబ్బంది కలగొద్దన ఉద్దేశంతో కార్యక్రమాలను హాజరయ్యానని చెప్పుకొచ్చారు.
- Advertisement -