- Advertisement -
న్యూఢిల్లీః ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. గత ఆదివారం జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగెటీవ్ వచ్చింది. అయినా, ఆయనకు వైద్యులు పలు టెస్టులు చేశారు. సోమవారం మన్మోహన్ సింగ్ ఆరోగ్యం కుదుటపడిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. కరోనా లక్షణాలు కూడా కనిపించకపోవడంతో ఆయనను డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు వెల్లడించారు.
Former PM Manmohan Singh discharged from AIIMS
- Advertisement -