- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. నాయిని ఆరోగ్యం పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొరుగైన చికిత్స అందించాలని కెటిఆర్ డాక్టర్లను కోరారు. గత నెల 28న కరోనా బారిన పడిన నాయిని నర్సింహారెడ్డి బంజారాహిల్స్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 16 రోజుల పాటు చికిత్స పొందారు. అనంతరం పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. ఆక్సిజన్ పడిపోవడంతో ఈ నెల 13 నుంచి అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -