Saturday, April 27, 2024

అప్పటికి కెటిఆర్ ప్రధాని అవుతారు: ఆశా జడేజా

- Advertisement -
- Advertisement -

KTR will be prime minister

 

దావోస్: రాబోయే 20 ఏళ్లలో మంత్రి కెటిఆర్ భారత దేశానికి ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ప్రముఖ వెంచర్ క్యాపటలిస్టు ఆశా జడేజా మోత్వాని కొనియాడారు. ఆమె తన ట్విట్టర్‌లో కెటిఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న యువకుడిని రాజకీయాలలో ఇప్పటి వరకు  చూడలేదని, అవి కెటిఆర్ లో పస్పుటంగా కనిపిస్తున్నాయన్నారు. మంత్రి కెటిఆర్ బృందం తెలంగాణకు పెట్టుబడులు తీసుకరావడంలో దావోస్ లో ఆమోఘమైన కృషి చేస్తుందని మెచ్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలపై దావోస్ వేదికగా కెటిఆర్ బృందం దూసుకెళ్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News