Saturday, April 27, 2024

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు, పబ్‌ల మూసివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. జనవరి 26వ తేదీన వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో గురువారం సాయంత్రం నుంచే మందుబాబులు వైన్ షాపుల ఎదుట మందుబాబులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే వైన్‌షాపుల దగ్గర రద్దీ నెలకొంది. పబ్లిక్ హాలిడే, దీనికితోడు లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో వైన్‌షాపుల ఎదుట బారులు తీరారు. ఇప్పటికే సగానికి పైగా జనాలు మద్యాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది..

జనవరి 26వ తేదీ నేషనల్ డ్రై డే అంటే దేశవ్యాప్తంగా ఎక్కడా వైన్ షాపులు ఉండవు. బార్లు తెరవరు. పబ్స్ ఓపెన్ చేయరు. హోటల్స్‌లో మందు పోయరు.రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోని రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈ ఉత్తర్వుల్లో తెలిపింది. మళ్లీ తిరిగి శనివారం మద్యం షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News