- Advertisement -
హైదరాబాద్ : 31 వ రోడ్డు భద్రతా వారత్సవాలను పురస్కరించుకొని ఎల్. బీ. నగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం కార్యక్రమం చేపట్టారు. బైక్ పై వెళ్తున్న డ్రైవర్ సహా వెనుక వ్యక్తి సైతం హెల్మెట్ ధరించి ప్రయణిస్తే, ట్రాఫిక్ పోలీసులు తమ సొంత ఖర్చుతో ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు అందజేశారు. ఈసందర్భంగా అడిషనల్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాని, ఈ ప్రమాదాల్లో లక్షా యాబై వేలమంది చనిపోతున్నారన్నారు. దీంతో రెండు లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారని తెలిపారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు సమాజహితం కోరుకునే వారిగా, ట్రాఫిక్ పోలీసులుగా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై రమేష్, సిబ్బంది భాస్కర్, సాయి కుమార్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Liter petrol free if wearing helmet
- Advertisement -