Sunday, May 5, 2024

మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఆదివారంతో మూడో విడత లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ ఎన్ డీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనల మార్పులు, చేర్పులను చేస్తాయని తెలిపింది. ఆర్థిక వ్యవహార పునరుద్ధరణ నిబంధనలు కేంద్రహోంశాఖ ఇస్తుందని ఎన్ డీఎంఏ పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక, తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే.

Lockdown Extended until May 31 in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News