Monday, April 29, 2024

ప్రేమ… పెళ్లి చేసుకోలేదని యువకుడిపై దాడి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రేమించాడు కానీ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆ యువకుడిపై ప్రేమికురాలు యాసిడ్ దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగేంద్ర అనే యువకుడు ఓ యువతి ప్రేమించాడు. మరో యువతిని నాగేంద్ర పెళ్లి చేసుకోవడంతో అతడిపై ప్రియురాలు పగపెంచుకుంది. గత వారమే ప్లాన్ ప్రకారం అతడి చేయి యాసిడ్ పోసింది. ఆ గాయము నుంచి కోలుకోక ముందే అతడిపై మరోసారి యాసిడ్ దాడికి పాల్పడింది. బాధితుడిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నంద్యాల రూరల్ సిఐ ఆస్పత్రికి చేరుకొని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News