Tuesday, April 30, 2024

ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని కొర్లగుంట ప్రాంతం నవోదయ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముని లక్ష్మి డిగ్రీ చదువుతుండగా చంద్రమౌళి అనే యువకుడితో పరిచయమైంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ వ్యవహారం ముని లక్ష్మి కుటుంబ సభ్యులకు తెలియడంతో చంద్రమౌళి తల్లిదండ్రులతో ప్రేమ జంటకు పెళ్లి చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రమౌళి తల్లి దండ్రులు ఒప్పుకోకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరుచానూరు పోలీసులు యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేయడంతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ముని లక్ష్మి కేసును వాపస్ తీసుకుంది. తాజాగా చంద్రమౌళిని ఆయన తల్లిదండ్రులు బెంగళూరుకు పంపించడంతో తన ప్రియుడు తనకు పెళ్లి చేయాలని ఆయన ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. తన ప్రియుడితో తనకు పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు తెలిపింది. పోలీసులు మళ్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Lover Strike front of boy Friend House in Andhra,
The love affair was made known to Muni Lakshmi’s family and Chandramouli appealed to her parents to marry the couple.

 

Lover Strike front of boy Friend House in Andhra
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News