Saturday, April 27, 2024

మహారాష్ట్ర జయభేరి

- Advertisement -
- Advertisement -

Maharashtra

గౌహతి: అస్సాంతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు 218 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఊరిస్తున్న లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన అస్సాంను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో మహారాష్ట్ర బౌలర్లు సఫలమయ్యారు. అశయ్ పాల్కర్ ఆరు వికెట్లు తీసి అస్సాం ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ముకేశ్ మూడు వికెట్లతో తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరి ధాటికి తట్టుకోలేక అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది.

ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగిలిన వారు పాల్కర్ ధాటికి తట్టుకోలేక పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 175 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు అస్సాం 244 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర పుంజుకుంది. ఓపెనర్ జై పాండే (130) సెంచరీతో మహారాష్ట్రను ఆదుకున్నాడు. విశాంత్ (57), సత్యజీత్ 51 (నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో మహారాష్ట్ర 9 వికెట్ల నష్టానికి 365 పరుగులు సాధించి డిక్లేర్డ్ చేసింది.

Maharashtra beat Assam by 218 runs in Guwahati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News