- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : అడిషనల్ డిజిగా పదోన్నతి పొందిన రాచకొండ సిపి మహేశ్ భగవత్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేళ్లుగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతా ఓ టీమ్గా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. నేరాల నియంత్రణ, మిస్టరీ కేసుల ఛేదనలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. అడిషనల్ డిజి పదోన్నతితో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేశంలోనే ఏరియా పరంగా రాచకొండ కమిషనరేట్ అతిపెద్దదని, ఎన్నో సవాళ్లను అదిగమించి అంకితభావంతో పనిచేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్లోనూ ప్రజలతో మరింత మమేకమై పని చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.
- Advertisement -