Monday, April 29, 2024

భూమి విక్రయంలో మోసం.. వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for selling land with forged documents

మిడ్జిల్: నకిలీపత్రాలతో భూమి విక్రయంలో ఓ వ్యక్తి అధికారులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ లో శనివారం వెలుగులోకి వచ్చింది. నకిలీపత్రాలతో జావేద్ అనే వ్యక్తి భూమి అమ్మేందుకు ప్రయత్నించాడు. రెండు ఎకరాల భూమి విక్రయించేందుకు జావేద్ ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసేందుకు అతను తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. నకిలీ ప్రత్రాలను గుర్తించిన తహశీల్దార్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జావేద్ ను అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News