Monday, April 29, 2024

లేడీ కిలాడీ…. రూ.200 కోట్లకు టోపీ

- Advertisement -
- Advertisement -

shilpa chowdary

హైదరాబాద్: ఓ లేడీ కిలాడీ ఏకంగా రూ.200 కోట్ల మోసానికి పాల్పడింది. ఈ లేడీ కిలాడీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన శిల్పా చౌదరి ఓ వ్యాపారవేత్తగా చలామణి అవుతోంది. ఆమె ఫేజ్ త్రీ పార్టీలు ఇస్తూ అందరిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ లోని గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు  చేసి మోసం చేస్తోంది.  తక్కువ టైంలో ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపి డబ్బులు వసూలు చేస్తుంది. ఆ తర్వాత జాడ లేకుండా పోతుంది. ఇలా పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు, ఐఎఎస్, ఐపిఎస్ లను కూడా మోసం చేసినట్టు తెలుస్తోంది. బడా బాబులతో పరిచయాలు పెట్టుకొని అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులను వసూలు చేసి మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. రోహిణి అనే మహిళ నాలుగు కోట్ల రూపాయలు శిల్పా చౌదరికి ఇచ్చింది. సదరు మహిళ శిల్పాను పలుమార్లు డబ్బులు అడిగిన ఇవ్వకపోవడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణలో ఆమె నిజస్వరూపం బయటపడింది. దీంతో ఆమె బాధితులు పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పోలీసులు శిల్పతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News