Friday, April 26, 2024

మాస్కు పెట్టుకొమ్మన్నందుకు కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Man Attacked With Knife In Karimnagar

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి షేవింగ్ చేసే కత్తితో దాడి
గాయపడిన రాకేష్, ఆస్పత్రికి తరలింపు
కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి హెయిర్ సెలూన్‌లో ఘటన

కరీంనగర్: మాస్కు కోసం జరిగిన చిన్న గొడవ కత్తితో దాడి చేసే వరకు వెళ్లిన ఘటన బుధవారం కరీంనగర్ జిల్లా, తీగలగుట్టపల్లిలో చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ సీఐ తుల శ్రీనివాస్‌రావు కథనం మేరకు.. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వల్లంపహాడ్ గ్రామానికి చెందిన ఉసికమల్ల రాజశేఖర్ బుధవారం ఉదయం తీగలగుట్టపల్లిలోని హెయిర్ సెలూన్ దుకాణానికి కట్టింగ్ చేయించుకోవడానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి సైతం కట్టింగ్ చేయించుకోవడానికి అదే దుకాణానికి వచ్చాడు.

ఆ సమయంలో తీగలగుట్టపల్లికి చెందిన ఎండి ఆసిఫొద్దీన్ అనే వ్యక్తి హెయిర్ సెలూన్ షాపుకు వచ్చి రాకేష్ పక్కనే కూర్చున్నాడు. ఈ సందర్భంలో ఆసిఫొద్దీన్‌ను ముఖానికి మాస్కు పెట్టుకోవాలని రాకేష్ సూచించాడు. అందుకు నిరాకరించిన క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. అది కాస్తా గొడవు దారి తీయడంతో కోపంతో ఊగిపోయిన ఆసిఫొద్దీన్.. రాకేష్‌ను కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రాకేష్‌కు నడుము భాగంలో కత్తి గాయం అయ్యింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రాకేష్ సోదరుడు నరేష్ అన్నను హుటాహుటిన కరీంనగర్‌లోని ఆర్కిడ్ ఆసుపత్రికి తరలించాడు. నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తుల శ్రీనివాస్‌రావు తెలిపారు.

Man Attacked With Knife In Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News