Monday, April 29, 2024

పెళ్లైనా వదలకుండ మహిళపై వేధింపులు.. చివరికి చచ్చాడు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పెళ్లైన మహిళను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతను మృతి చెందిన ఘటన నగరంలోని అల్లాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపుర్ లోని శ్రీ చైతన్య ప్రైవేటు కాలేజీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాజయ్య అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై ఏళ్ల ఓ అమ్మాయిని మూసపేట్ లో కలిశాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే, అతని మాటలను తిరస్కరించిన ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో తనని కాదని మరోవ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమెపై కోపం పెంచుకున్న రాజయ్య వేధింపులకు దిగాడు. ఆమెతోపాటు, భర్త, తల్లిని కూడా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన వారు శుక్రవారం రాజయ్య ఇంటికి వెళ్లి కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మరణించినట్లు డాక్టర్లు తెలిపారని బాలానగర్ ఎసిపి పురుషోత్తమ్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని హత్య కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Man beaten to death for harassing woman in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News