Monday, April 29, 2024

కట్నం కోసం భార్యతో యాసిడ్ తాగించాడు

- Advertisement -
- Advertisement -

Man Forces Wife to Drink Acid in Madhya Pradesh

భోపాల్: అదనపు కట్నం కోసం ఓ భర్త తాను కట్టుకున్న భార్యతో యాసిడ్ తాగించిన అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. గ్వాలియర్ కు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి తన భార్యతో బలవంతంగా యాసిడ్ తాగించాడు. వీరేంద్రకు బాధిత మహిళకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే కట్నం ఇచ్చినా అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టేవాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దానికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన అతను భార్యతో యాసిడ్ తాగించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Man Forces Wife to Drink Acid in Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News