Wednesday, May 8, 2024

తిమ్మాయిపల్లిలో ఘర్షణ: కొడ్డలితో దాడి.. వ్యక్తి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లాలోని మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వ్యక్తిగత కారణాలతో గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి గురువారం ఉదయం లక్ష్మణ్ పై గొడ్డలితో దాడి చేశాడు.ఈ దాడిలో లక్ష్మణ్ తీవ్రంగా గాయపడడంతో గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నర్సింలు ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనతో గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Man Injured after attack with Axe in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News