Friday, April 26, 2024

బాయ్‌ఫ్రెండ్ యాసిడ్ దాడి : యువతి మృతి

- Advertisement -
- Advertisement -

Man kills Girlfriend after attacking her with Acid

 

ఔరంగాబాద్ : మహారాష్ట్ర బీడ్ జిల్లా లో శనివారం తెల్లవారు జామున బాయ్‌ఫ్రెండ్ యాసిడ్ దాడికి తీవ్ర గాయాల పాలైన యువతి మృతి చెందిందని పోలీసులు ఆదివారం చెప్పారు.  బాధితురాలు అవినాష్‌రాజూరి (25) స్వగ్రామం నాందేడ్ జిల్లా షెలగావ్. పుణె నుంచి తన స్వగ్రామానికి నిందితునితో వస్తుండగా మార్గమధ్యంలో యాలంబ్ ఘాట్ వద్ద కాసేపు ఆగినప్పుడు నిందితుడు ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. అంతేకాదు తరువాత ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడానికి ప్రయత్నించాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తమకు ఈ సమాచారం తెలిసిందని దాడికి కారణమేమిటో ఆమె చెప్పలేదని ఆమె నుంచి మరణ వాంగ్మూలం తీసుకున్న తరువాత మృతి చెందిందని పోలీసులు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News