Saturday, April 27, 2024

రెండో భార్యను పారతో కొట్టి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

Man kills wife with spade in UP

కౌశాంబి: కట్టుకున్న భార్యను భర్త పారతో దారుణంగా కొట్టి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లా కరారీ ఏరియాలోని మీరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మీరాపూర్ గ్రామానికి చెందిన సుగ్గీదేవి (35), ఫ‌కీర్ లాల్ (48) భార్యాభ‌ర్త‌లు. ఫ‌కీర్‌లాల్‌కు సుగ్గీదేవి రెండో భార్య‌. వాళ్లకు ముగ్గురు పిల్లలున్నారు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకోగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. వీరి మధ్య ఏదో ఒక విషయంపై గొడవ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం భార్యాభర్తల నడుమ కొట్లాట జరిగింది. దీంతో కోపొద్రిక్తుడైన భర్త చేతిలో ఉన్న పారతో సుగ్గదేవి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Man kills wife with spade in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News