Saturday, May 4, 2024

దంపతుల మధ్య గొడవ…. భార్యను మూడో ఫ్లోర్ నుంచి తోసేసి…

- Advertisement -
- Advertisement -

Man pushes wife off 3rd floor

జైపూర్: దంపతుల మధ్య గొడవలు ఉండడంతో మూడంతస్థుల భవనం పైనుంచి కిందకు నెట్టేసిన సంఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిషా బైర్వా, హన్స్‌రాజ్ బైర్వా అనే దంపతులు కోటాలో నివసిస్తున్నారు. భార్య భర్త మధ్య గొడవలో రావడంతో ఆమె తన మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి ఉందామని చెప్పి భార్యను తనతో పాటు అద్దె ఇల్లు కోసం వెతికారు. ఉద్యోగ్ నగర్‌లో మూడంతస్థుల భవనంలోకి వెళ్లారు. మూడో ఫ్లోర్‌కు వెళ్లిన తరువాత ఎవరు కనిపించకపోవడంతో బిల్డింగ్ పైనుంచి భార్యను భర్త నెట్టేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆమె చెల్లెలుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి అనంతరం పారిపోయాడు. పోలీస్ అధికారి మహమ్మద్ ఇబ్రాహీం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News