ఛండీగఢ్: ఏడాది వయసున్న పాపపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన పంజాబ్ రాష్ట్రం మోహాలీలోని ఢకోలీ ప్రాంతంలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓం ప్రకాశ్ అనే వ్యక్తి పటియాలా రోడ్డులోని ఓ హోటల్లో హౌస్ కీపింగ్ పనులు చేసేవాడు. ఓ మహిళ ఏడాది వయసు ఉన్న పాపను తాను పని చేసే స్థలానికి తీసుకొచ్చేది. పాపను చెట్టు కింద పడుకోబెట్టి భవన నిర్మాణ పనులు చేసేది. తల్లి లేని సమయంలో ఓమ్ ప్రకాశ్ ఆ పాపను చెట్ట పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తుండగా తల్లి గమనించి కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. పాపను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఓం ప్రకాశ్పై ఐపిసి 376, పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పాప పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఏడాది పాపపై అఘాయిత్యం….
- Advertisement -
- Advertisement -
- Advertisement -