Friday, April 26, 2024

తెలంగాణలో కరోనా మరణాలు 1.1శాతం మాత్రమే: ఈటల

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender press meet on Coronavirus

హైదరాబాద్‌ః తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతం మాత్రమే అని, దేశంలోనూ కరోనా మరణాలు 3 శాతమేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవాం మీయా సమావేశంలో మంత్రి ఈటల మాట్లాతూ.. ”అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.. హైదరాబాద్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అవసరమైతే జీహెచ్‌ఎంసిలో లాక్‌డౌన్ పెడదామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. నాలుగైదు రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం. హైదరబాద్‌లోని కంటైన్మెంట్ జోన్లలో జీహెచ్‌ఎంసితో కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను కూడా పెంచాం. ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం బాధితులకు చికిత్స అందిస్తున్నాం. 184 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. ఆరోగ్య శాఖలో 257 మంది కరోనా బారిన పడ్డారు. లక్షణాలు లేనివాళ్లు పరీక్షల కోసం ఆస్పత్రుల ముందు క్యూ కట్టొద్దు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సిఎం కెసిఆర్ కమిట్‌మెంట్‌ను ఎవరూ ప్రశ్నించలేరు” అని అన్నారు.

Corona death rate 1.1 percent only in Telangana: Etela

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News