Saturday, April 27, 2024

మణిపూర్ ఫైల్స్

- Advertisement -
- Advertisement -

తాజాగా వెలుగులోకి మరో దారుణం
ఇద్దరు యువతులపై హత్యాచారం నగ్న ఊరేగింపు ఘటన రోజే
అమానుషం ఇప్పటికీ జాడ దొరకని మృతదేహాలు
ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబుకుతున్న నిరసనలు

ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అ మానుష ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు చిమ్ముతున్న తరుణంలోనే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మే నెల 4వ తేదీ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక హత్యాచారం జరిగినటు ్లతెలుస్తోంది. ఈ మేరకు జాతీ య మీడియా కథనాలు వెల్లడించాయి. 21 నుంచి పాతికేళ్ల లోపు వయసుగల ఆ ఇద్దరు మహిళలు కాంగ్‌పోక్సీ ప్రాంతంలో కార్లు సర్వీ స్ చేసే సెంటర్‌లో పని చేస్తున్నారు. వారు పని లో ఉండగా కొందరు వ్యక్తులు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వంద మం దికి పైగా ఉన్న ఆ గుంపులో కొందరు మహిళ లు కూడాఉన్నారని, బాధితులపై లైంగిక దా డి చేసేలా గుంపులోని వారిని వారు ప్రోత్సహించారని బాధిత మహిళలతో పాటుగా పని చేస్తు న్న ఓ వ్యక్తి చెప్పారు. ఇద్దరు మహిళలను జనం అక్కడే ఉన్న ఓ రూమ్‌లోకి లాక్కెళ్లారని, అరవకుండా నోటిలో బట్టలు కుక్కి, లైట్లు ఆర్పేసి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆ వర్కర్ చెప్పాడు. ఆ తర్వాత వారిని బైటికి లాగేసిన గుంపు దగ్గర్లోనే ఉన్న సామిల్ వద్ద పడేసి వెళ్లి పోయారు.

బాధిత మహిళల బట్టలన్నీ చిరిగి పోయి ఉన్నాయని, వారి శరీరమంతా రక్తంతో నిండి ఉందని కూడా అతను చెప్పాడు. అయితే భయం కారణంగా ఈ ఘటన గురించి బాధిత కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ బాధితుల్లో ఒకరి తల్లి ధైర్యం తెచ్చుకుని మే 16వ తేదీన సైకుల్ పోలీసు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. తన కుమార్తెతో పాటుగా మరో మహిళను దారుణంగా రేప్ చేసి క్రూరంగా హింసించిన తర్వాత హత్య చేశారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఆ తర్వాత ఇంఫాల్ జిల్లాలోని పోరోంపట్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే మృతదేహాలను ఇంకా కనుగొనలేదని, వారు ఏమయ్యారో కూడా ఈ రోజు వరకు తెలియదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి చేసిన వారి సంఖ్య 100నుంచి 200 దాకా ఉంటుందని కూడా అందులో పేర్కొన్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లుగా చెబుతున్న వీడియోకు సంబంధించిన ఫిర్యాదు దాఖలయింది కూడా ఇదే పోలీసు స్టేషన్‌లో కావడం గమనార్హం. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా మణిపూర్ పోలీసులకు వివిధ రకాల నేరాలకు సంబంధించి ప్రతిరోజూ వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు లాంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.

అయిదో నిందితుడి అరెస్టు

ఇదిలా ఉండగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.దీంతో ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన వారి సంఖ్య అయిదుకు చేరింది. వైరల్ అయిన వీడియోలో కన్పిస్తున్న వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మణిపూర్ లోయ, పర్వత ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో పోలీసులు126 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితుడు హెరోదాస్ మైతేయ్ ఇంటికి కొంతమంది మహిళలు శుక్రవారం నిప్పు పెట్టారు.

బాధిత మహిళలకు తక్షణ జరిగేలా చూడాలి :  నాగా సంఘాలు

ఇదిలా ఉండగా గత మే 4వ తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను శనివారం రాష్ట్రంలో పలు నాగా పౌర సమాజాలు తీవ్రంగా ఖండించాయి. వీటిలో బలమైన యునెటెడ్ నాగా కౌన్సిల్, ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ లాంటి సంఘాలు కూడా ఉన్నాయి.ఈ కేసులో న్యాయం వెంటనే లభించేలా చూడడం కోసం మణిపూర్ ప్రభుత్వం దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేలా చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నాగా కౌన్సిల్ డిమాండ్ చేసింది.ఈ అమానుష ఘటనతో సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేయడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా ఆ సంఘం డిమాండ్ చేసింది. వైరల్ అయిన వీడియోను ప్రస్తావిస్తూ, పట్టపగలు, జాతీయ రహదారిపై మహిళలపై జరిగిన ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని నాగా కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మణిపూర్‌లో ఇటీవల జాతుల మధ్య చెలరేగిన హింసాకాండకు ఇప్పటివరకు నాగాలు చాలా వరకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండించడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు వారు కూడా తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News