Saturday, April 27, 2024

పంచాయతీ కార్యదర్శిని కర్రలతో కొట్టి చంపిన మావోలు

- Advertisement -
- Advertisement -

Maoists attack on Village secretary in chattishgarh

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శిని మావోయిస్టులు కర్రలతో కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హరక్ చౌదరి అనే వ్యక్తి ఓర్చా బ్లాక్‌లోని పోచావాడ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పని చేస్తున్నాడు. పంచాయతీ పనుల కోసం రోహ్తాద్ గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా మావోలు ఆపి అతడిని కర్రలతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహంపై కర్ర పత్రాలు ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఓర్చా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా ఉన్నాడనే అనుమానంతో అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News