Thursday, May 9, 2024

ప్రతి గింజా కొంటాం

- Advertisement -
- Advertisement -

ఆందోళన చెందవద్దు.. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని , ఈ విషయంలో రైతాంగం ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల సంస్ధ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు పౌర సరఫరాల భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3,074 కేంద్రాల ద్వారా 80 వేల మంది రైతుల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మిర్యాలగూడ లో ప్రత్యేక మైన పరిస్దితులు వున్నాయని , అక్కడ పెద్ద ఎత్తున రైస్ మిల్లులు వుండటం, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 తేమ శాతం వుండాల్సి వుండగా అక్కడి మిల్లర్లు 23 నుంచి 26 శాతం వరకు తేమ వున్నప్పటికీ సన్నరకపు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు.

కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ.1880 వుండగా మిల్లర్లు క్వింటాల్ కు రూ 82 అధికంగా పెట్టి క్వింటాల్ కు రూ 1970 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో పక్క జిల్లాలైన సూర్యాపేట, యాదాద్రి , ఖమ్మం , జనగాం, జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి సన్న ధాన్యం అమ్ముకుంటున్నారు. మిల్లుల సామర్ధ్యానికి కంటే అధికంగా ధాన్యం వస్తుంది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో రోజుకు 1500 వాహనాలు వస్తుండేవన్నారు. ఇప్పుడు 4 వేల నుంచి 5 వేల వాహనాలు వస్తుండటంతో రోడ్లపై వాహనాల రద్దీ ఏర్పడిందన్నారు. కాగా ఇప్పటి వరకు సుమారు 1.25 లక్షల టన్నుల సన్నాలను మిల్లర్లు కొనుగోలు చేశారన్నారు. కాగా నల్గొండ జిల్లాలో పౌరసరఫరాల సంస్థ 177 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సూర్యాపేటలో 302 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Mareddy Srinivas Reddy Press Meet on Paddy Purchases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News