Saturday, April 27, 2024

నాదర్‌గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సామూహిక తోటల పెంపకం

- Advertisement -
- Advertisement -

Nadargul Delhi Public School

 

హైదరాబాద్ : నాదర్‌గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సిఎం కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా క్యాంపస్‌లో సామూహిక తోటల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్ ఎం.కొమరయ్య గ్రీన్ క్యాంపస్ గురించి విద్యార్థులకు వివరించారు. తోటల పెంపకాన్ని కొనసాగించడం ద్వారా గ్రీన్ కవర్‌ను కాపాడుకోవడం, సంరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిహెచ్. రమణకుమార్, అదనపు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, విజయలక్ష్మి, డిఈఓ, అనుప్ కుమార్, అర్జున అవార్డు గ్రహిత రోలర్ స్కేట్ అథ్లెట్, మల్కా కొమరయ్య -చైర్మన్, డాక్టర్ సుధ అకాడమిక్ డైరెక్టర్, సునీతా రావు, ప్రిన్సిపాల్ డిపిఎస్ నాచారం, జ్యోతి తురాగా ప్రిన్సిపాల్ డిపిఎస్ నాదర్‌గుల్, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ ఖన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు మొక్కలను పంపిణీ చేశారు.

Mass Gardening at Nadargul Delhi Public School
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News