Monday, April 29, 2024

పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు

- Advertisement -
- Advertisement -

Mega power star ram charan act in two films

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేస్తున్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చివరి దశకు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే చరణ్ తన నెక్స్ ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు. దిల్‌రాజు నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. దీని తర్వాత చెర్రీ ఫలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడంటూ రోజుకో న్యూస్ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ లైనప్ మీద అతడి సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ కంటే ముందే ‘ఆచార్య’ సినిమాతో చెర్రీ ఫ్యాన్స్‌ని పలకరించబోతున్నాడు.

ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’, ‘ఆర్‌సి15’ చిత్రాలు రానున్నాయి. ఆ తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తాడని తెలిసింది. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్,- కొరటాల శివలతో కూడా రామ్‌చరణ్ సినిమాలు ఉంటాయని టాక్ నడుస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్, – పూరీ జగన్నాథ్‌లతో కూడా చర్చలు జరుగుతున్నాయని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకునే విధంగా చరణ్ లైనప్ ఉండబోతోందని అర్థమవుతోంది. తాను నటించే ప్రతి చిత్రాన్ని కూడా తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్‌చరణ్. చెర్రీ లైనప్‌పై చిరంజీవి కూడా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News