Saturday, April 27, 2024

ధర్మస్థలి తలుపులు తెరుచుకోనున్నాయి

- Advertisement -
- Advertisement -

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు టైటిల్ మోషన్ పోస్టర్, గుడి సెట్ వీడియో.. ‘సిద్ధ’గా చరణ్ బ్యాక్‌లుక్ మినహా ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ చిత్ర యూనిట్ షేర్ చేయలేదు. చివరికి కొరటాల శివ ‘ఆచార్య’ టీజర్ విడుదల తేదీని ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇందులో ‘జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకోనున్నాయి’అని చెబుతూ ‘ఆచార్య’ టీజర్ అప్‌డేట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందపడిపోతున్నారు. కాగా కొరటాల ఈ చిత్రాన్ని తనదైన శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి రూపొందిస్తున్నాడని తెలిసింది. దేవాదాయ భూములు, – నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News