Friday, April 26, 2024

కానిస్టేబుల్ చూపుడు వేలును కొరికేశాడు….

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: మతిస్థిమితం లేని వ్యక్తి ఓ కానిస్టేబుల్ వేలును కొరికేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం నాగ్‌పడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రస్తుతం సదరు కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేలు రెండు భాగాలుగా విడిపోవడంతో అతకడం కష్టమేనని వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహ్మద్ షకీల్ షబ్బీర్ హుస్సేన్ సల్మానీ అనే వ్యక్తి మతిస్థిమితం లేకపోవడంతో రోడ్డు పై వెళ్లే వాళ్లను తిట్టడమే కాకుండా భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకొని సల్మానీ పట్టుకొవడానికి ప్రయత్నించాడు. సల్మాని ఎడమ చేతిని జనార్దన్ షాక్రే అనే కానిస్టేబుల్ పట్టుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్ చూపుడు వేలును సల్మాని కొరికేశాడు. దీంతో వెంటనే స్థానికులు సల్మానీ పట్టుకొని బంధించారు. గాయపడిన కానిస్టేబుల్‌ను జెజె ఆస్పత్రికి తరలించారు. సల్మానీ సోదరుడు సర్ఫరాజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తన సోదరుడికి మతిస్థిమితం లేదని పోలీసులకు తెలిపాడు. సల్మానీని గతంలో థానే మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించామని, అతడి మానసికస్థితి మాత్రం నిలకడగా లేదని పేర్కొన్నారు. థానే మానసిక వైద్యశాలలో సల్మానీని అడ్మిట్ చేసిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని సర్ఫరాజ్ తెలిపాడు.

 

Mentally unstable man bites off constable’s finger
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News