Saturday, April 27, 2024

పాక్ ఆర్మీ క్యాంపు పై ఆత్మహుతి దాడి

- Advertisement -
- Advertisement -

హైదారబాద్: పాకిస్థాన్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్తాన్ మిలిటరీ క్యాంపుపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఆత్మహుతి దాడిలో 23 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ దాడిలో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కు తో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు సభ్యుల బృందం పాల్గొన్నది. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News