హైదరాబాద్ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్కుమార్ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అల్ట్రస్ట్ టెక్నాలోజి, చోళ జెనరల్ ఇన్సూరెన్స్, ఐడిబిఐ ఫెడరల్ , టాటా స్రైవ్,శ్రీమిత్ర డెవలపర్స్ వంటి ఐదు ప్రైవేటు కంపెనీల్లో పనిచేయుటకు దాదాపు 200 ఉద్యోగాల ఎంపికకు మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్దులు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఏదైనా పిజి చదివిన వారు అర్హులన్ని, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీసు రిప్రజేంటివ్ మొదలైన ఉద్యోగాల కోసం ఇంటర్వూ జరుగుతున్నట్లు చెప్పారు. ఎంపిక కాబడిన వారికి నెలకు వేతనం రూ.9వేల నుండి రూ. 17వేల వరకు అందజేస్తామని, అభ్యర్దుల వయస్సు 19నుండి 30వరకు ఉండాలన్నారు. అర్హత, ఆసక్తిగల నిరుద్యోగులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ జీరాక్స్ కాఫీలతో ఈనెల 26 బుధవారం విజయనగర్ కాలనీ, మల్లేపల్లి బాలురు ఐటిఐ క్యాంపస్ వద్ద ఉన్న ఉపాధి కార్యాలయానికి ఉదయం 10.30గంటలకు హాజరు కావాల్సిందిగా కోరారు.