Monday, April 29, 2024

పట్టుగూళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలి: తెలంగాణ రైతుసంఘం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో పట్టుగూళ్లకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరకల్పించాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. పట్టుగూళ్ల మార్కెట్లో ధరలు, పేమెంట్, ఇన్సెంటివ్, రోగ నిరోధకాలు, పనిముట్లు, సబ్సిడీ సమస్యలపై బుధవారం సెరికల్చర్ సహాయ కమిషనర్ కార్యాలయం, మార్కెట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ పట్టు రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ శ్రీధర్ రెడ్డి, మెరిండ్ల శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ పట్టు రైతులను తిరుమలగిరి పట్టు మార్కెట్లో చాలా కాలంగా అన్యాయానికి డీలర్లు ఆఫీసర్లు సరైన రేట్లు ఇవ్వక రైతులను నష్టపరుస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహం, షేడ్ సబ్సిడీ, రోగ నియోజకవర్గాలు పని యంత్రాలు అందించాలన్నారు.

అలాగే పట్టు రైతులకు మార్కెట్లో తగిన సదుపాయాలు కల్పించాలిని, రైతుకు గౌరవప్రదమైన రేట్లు కనీస ధరను నిర్ణయించాలన్నారు. పట్టు రైతుల పట్ల మార్కెట్ అధికారులు వ్యవహరించే తీరు పూర్తిగా మారాలని కోరారు. రైతు లేనిదే మార్కెట్ లేదని వాళ్ళు గ్రహించాలన్నారు. పట్టుగూళ్లకు ఆంధ్ర, కర్నాటక మార్కెట్లతో సమానంగా రేట్లను తిరుమలగిరి, జనగామ మార్కెట్ లలో ఇవ్వాలన్నారు. పట్టుగూళ్లు అమ్మిన రోజే రైతు ఖతాలో మార్కెట్ నుండి డబ్బులు జమ చేయాలన్నారు. జల్లిగూళ్లకు నుంచి పట్టుగూళ్లు రేటు లో 1/3ఒకటిబై మూడవ వంతు రేటు, డబుల్ గూళ్లకు ఒకటిబై రెండవ వంతు రేటు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం 2018 నుండి రైతులకు రావాల్సిన ప్రోత్సాహకాలు 75 రూపాయల ను వెంటనే విడుదల చేయాలన్నారు. మినిట్రాక్టర్ ,ఇతర పట్టు వ్యవసాయ యంత్ర పరికరాలు, పట్టుపురుగుల రోగనిరోధకాలు 80శాతం సబ్సిడీ తో రైతులకు అందించాలని కోరారు.

ప్రస్తుతం తెలంగాణ సెరికల్చర్ విభాగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పదవీవిరమణ పొందుతున్నారని, వారిస్థానంలో కొత్త వారిని వెంటనే నియమించాలని కోరారు. వారి సలహాలు, సూచనలు లేకుండా పట్టు వ్యవసాయం లేదని తెలిపారు. రాష్ట్రంలో చాకి సెంటర్ లను పెంచడం, అలాగే పట్టుగుడ్ల డ్రైనేజి ని వెంటనే ప్రారంబించాలని కోరారు. హైదరాబాద్, జనగామ మార్కెట్లలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం సెరికల్చర్ సహాయ కమిషనర్ సుధాకర్, మార్కెట్ అధికారి ఎం శివకుమార్ లను కలిసి వినతపత్రం అందజేశారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని , ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అధికారులు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News