- Advertisement -
హైదరాబాద్: నగర ప్రజలకు మంచినీరు సరఫరా మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర మున్సిపల్,పట్టణాభివృద్ది శాఖమంత్రి కె.తారకరామారావు జలమండలి అధికారులకు సూచించారు. శనివారం ప్రగతి భవన్లో జలమండలి కార్యక్రమాలు, పలు అభివృద్ది పనులపై మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, జలమండి ఎండీ దానకిషోర్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి అధికారులు పలు సూచనలు చేశారు. తిరిగి సోమవారం మరోమారు సమావేశమవుతామన్నారు. ఈసమావేశంలో ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్లు శ్రీదర్బాబు, రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు ఆజ్మీరా కృష్ణ, రవి, పైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Minister KTR review on water board development works
- Advertisement -