Monday, May 6, 2024

గవర్నర్‌ను కలిసిన పొంగులేటి.. ఆహ్వానం అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. అలాగే తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి సంబంధించిన ఆహ్వానపత్రికను అందజేశారు. వివాహానికి తప్పక హాజరు కావాలని పొంగులేటి గవర్నర్‌ని కోరారు. అనంతరం మంత్రి కాసేపు గవర్నర్‌తో కూర్చోని వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News