Saturday, April 27, 2024

3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్: మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పేర్కొన్నారు. న‌గ‌రంలో ఆదివారం తెల్ల‌వారుజాము నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ జిహెచ్ఎంసి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

ప్రజలు అత్యవసర సేవల కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని చెప్పారు. వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News