Saturday, May 11, 2024

బోయినపల్లి వినోద్ కుమార్‌తో మైనారిటీ నేతల భేటి

- Advertisement -
- Advertisement -
లక్ష ఆర్థిక సహాయంపై హర్షం

హైదరాబాద్ : మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మైనారిటీలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో పలువురు మైనారిటీ నాయకులు, యువత రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని, ఆయనకు రుణ పడి ఉంటామని ఈ సందర్భంగా వారన్నారు. వినోద్ కుమార్‌ను కలిసిన వారిలో మైనారిటీ నాయకులు ఫిరోజ్ ఖాన్ , ఫైజల్ ఖాన్, ఫసి ఖాన్, అయాన్ ఖాన్, అక్బర్, జాఫర్ పటేల్, సాజిద్, తదితరులు ఉన్నారు.

ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను మంత్రుల నివాసంలో ఆదివారం అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గజ మాల వేసి, ఒంటెతో ప్రదక్షిణలు వేయించి, కేక్ కట్ చేసి బిఆర్‌ఎస్ పార్టీ మలక్ పేట నాయకులు ఫిరోజ్ ఖాన్, ఫైజల్ ఖాన్, ఫసి ఖాన్, అయాన్ ఖాన్, తదితరులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు, పార్టీ నాయకులు కేక్ కట్ చేసి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News