Thursday, May 9, 2024

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న వంద రోజులు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు. ఆదివారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేందుకు చేపట్టిన కార్యాచరణను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News